JGL: మెట్పల్లి మండలం పెద్దాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇల్లెందుల దివ్య (34) అనే వివాహిత తన ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.