RR: మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. గత నెల 25న రామాయంపేటకు చెందిన గృహిణి మియాపూర్లోని తన కుమార్తెను కలిసేందుకు వచ్చారు. నడుచుకుంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.