కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి మండల పెద్దలు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.