ASR: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల పరిధిలోని గ్రామాలన్నింటినీ పర్యవేక్షణ చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం తెలిపారు. జర్రెల పంచాయతీ ప్రధాన రహదారి నుంచి మిగిలిన గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాగే అక్కడ మధ్యలో కొండవాగుపై వంతెన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.