అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి వ్యతిరేకంగా ఈనెల 14 నుంచి 20 వరకు గుంతకల్లు పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడదామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సీపీఎం కార్యాలయంలో వామపక్ష పార్టీ నాయకులతో కలిసి రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు.