KMM: జిల్లాలో మామిడి సాగును 32,105 ఎకరాలలో సాగుచేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి యం.వి. మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం మామిడి పూత నుంచి పిందె దశలో ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిక్కుడు పురుగు, తేనె మంచు పురుగు, తామర, బూడిద రోగం, పక్షి కన్ను తెగులు వంటి నివారణకు సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.