BNR: తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమాఖ్య భువనగిరి జిల్లా కమిటీని నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధ్యక్షులు మహేష్,ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి సురేష్ నియమించారు. ఈ సందర్భంగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ వారికి ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.