కోనసీమ: దాక్షారామంలోని నిరుపేద పురోహితుడు కావుటూరి సీతారాంకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. సీతారాం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన ఆర్థిక, జీవన స్థితిగతులను తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ జీవనం కోసం ప్రతినెల రూ. 10 వేలు సహాయం చేస్తున్నారు.