KMM: తిరుమలాయపాలెం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఏలువారిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ 4 సంక్షేమ పథకాలను ఆదివారం ఆత్మ కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి పత్రాలను అందజేశారు. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న 4 సంక్షేమ పథకాలను ప్రారంభించిందని పేర్కొన్నారు.