ప్రకాశం: జనవరి 1వ తేదీ నుంచి సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం సదరం ప్రక్రియను నిలిపేశారని పేర్కొన్నారు.