VZM: దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం పోలీస్ స్టేషన్ను డీఎస్పీ పి. శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలను సిబ్బందికి అందజేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.