ADB: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించారని కోరుతూ MLA పాయల్ శంకర్ను మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యూనియన్ సభ్యులు తదితరులున్నారు.