ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి ఆలయంలో శనివారం ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి ఆలయ అర్చకులు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.