GDWL: గద్వాల ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ జాకార్డ్ యంత్రాలు చేనేత కార్మికుల పాలిట శాపంగా మారాయి. కోయంబత్తూరు క్యూబ్-టెక్ సంస్థ సరఫరా చేసిన పరికరాలు నాసిరకంగా ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి, యంత్ర లోపం వల్ల చీరలు డ్యామేజ్ అవుతున్నట్టు తెలిపారు.