TPT: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవపల్లె వీధిలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి కె.లక్ష్మమ్మ(67)ను నగల కోసం హత్య చేశారు. గొంతు నులిమి దిండుతో ఊపిరాడకుండా చేసి సుమారు 100 గ్రాముల బంగారం దోచుకెళ్లినట్లు సమాచారం. ఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.