ADB: జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు వివరాలను అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 25 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 282.10 అడుగులుగా ఉందని పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 25 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.