ప్రకాశం: విద్యుత్ ఛార్జీల బాదుడుపై మార్కాపురం పట్టణంలో కూటమి సర్కార్ పై శుక్రవారం వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టబోతున్నట్లు మార్కాపురం వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి విద్యుత్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. కావున ప్రజలు, నాయకులు హాజరుకావాలని కోరారు.