NLG: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున, పత్తి నిల్వలు పేరుకుపోయిన కారణంగా ఈనెల 27 నుంచి 29 వరకు పత్తి కొనుగోళ్లు సీసీఐ వారు నిలిపివేస్తున్నట్లు మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 30న తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే రెండు రోజులు(25,26 తేదీల్లో) సెలవులతో కొనుగోలు నిలిచిపోయింది.