NRML: దిలావర్పూర్ మండలం కదిలి గ్రామంలోని ప్రసిద్ధ మాత అన్నపూర్ణేశ్వరి సహిత పాపాహేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న కొబ్బరికాయల విక్రయ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బుధవారం ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రిని ఒక సంవత్సరం కాలపరిమితితో విక్రయించుకొనుటకు ఆసక్తి కలవారు రూ. 50,000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలని కోరారు.