KMR: చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండు తరలించినట్లు ఎస్సై సుధాకర్ మంగళవారం తెలిపారు. లింగంపేట్ మండలం నల్లమడుగుకు చెందిన రహీం ఈ నెల18న ఇంటికి తాళంవేసిబయటకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారని ఫిర్యాదు చేశారు. గాంధారికి చెందిన సాయిలును పట్టుకొనివెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.