MDCL: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సప్లై చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అబుల్లాపూర్ మెట్, ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేయగా.. వారి వద్ద నుంచి 164 కిలోల గంజాయి, కియా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి HYD మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు సరఫరా చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.