NLG: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ.. క్రైస్తవులకు పరమ పవిత్రమైనదన్నారు. క్రీస్తుబోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరుకున్నారు.