NLG: మునుగోడు మండలం లింగవారి గూడెంకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. మునుగోడు నుంచి లింగవారి గూడెం మీదుగా చౌటుప్పల్కు వెళ్లే పల్లె వెలుగు బస్సును సోమవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు. ఆర్టీసీ మంత్రితో మాట్లాడి ఎమ్మెల్సీ బస్సును మంజూరు చేయించారు. అనుచరులతో కలిసి స్వయంగా బస్ టికెట్ తీసుకుని గూడెం వరకు ప్రయాణించారు.