WGL: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సత్య శారదా దేవి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పనుల పురోగతిపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, పలు శాఖల అధికారులు ఉన్నారు.