KRNL: వైసీపీ నేత కుమార్తె వివాహం నిమిత్తం కర్నూలుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం వైసీపీ మండల కన్వీనర్ భీమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.