NLR: సంగం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం సుస్థిరాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో పేదరిక నిర్మూలన, జీవనోపాదుల కల్పన వంటి సంకల్పాలతో, ప్రణాళికలతో గ్రామపంచాయతీలు ముందుకు సాగాలన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.