సత్యసాయి: లేపాక్షి మండలంలోని కల్లు దుకాణాలపై సోమవారం విజిలెన్స్, ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. లేపాక్షి, చుట్టుపక్క గ్రామాల్లో విజిలెన్స్ సీఐ అలీ బేగ్, ఎక్సైజ్ సీఐ లక్ష్మీదుర్గయ్యలు కల్లు నాణ్యత తనిఖీ చేయడం కోసం శాంపిల్స్ సేకరించారు. నాణ్యత లేనట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేసినట్లు తెలిపారు.