SKLM: రణస్థలం మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల సంఘాలు నేతలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో షెడ్యూల్డ్ కులాల ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.