SKLM: నందిగాం మండలం పెద్ద బాణాపురం గ్రామంలో సోమవారం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జగన్నాథ్, పరమేశ్వరరావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.