కృష్ణ: రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేయడానికి వెళ్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బిపేటలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. రైతు సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమ పార్టీ నేతలు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు.