NRPT: పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధించుటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జీ ప్రిన్సిపల్ సునీత శుక్రవారం తెలిపారు. బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు స్థానికత కలిగిన మహిళలు ఈనెల 15లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.