అల్లూరి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద అనుచిత వ్యాక్యలు చేసిన విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ మెంబర్ అయిన కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి భేషరతుగా క్షమాపన చెప్పాలని అరకులోయ మండల సచివాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకులోయ మండల పరిషత్ సమావేశ మందరం వద్ద నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టారు. నిరసనలో సచివాలయ ఉద్యోగులు దొర మత్స్యరాజు, కొర్రా రాంబాబు తదితరులున్నారు.