WGL: హనుమకొండలో నిర్మించిన కాలోజీ కళాక్షేత్రానికి పగుళ్లు వస్తున్నాయని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియక తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. కాళోజీ కళాక్షేత్రం పనులలో తమ తప్పిదం ఏమీ లేదని పేర్కొన్నారు.