ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారిని శుక్రవారం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏలూరు కలెక్టరేట్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందించటం కోసం వెళ్తూ మార్గ మధ్యలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.