JGL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పెద్దూరి రాజయ్య(55) లాండ్రీ షాప్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.