ఫోర్బ్స్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ మహిళల జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలో శక్తివంతమైన మహిళల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు చోటు దక్కింది. జాబితాలో రోష్నీ నాదర్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షాల పేర్లు కూడా ఉండటం విశేషం. కాగా.. యూరోపియన్ కమిషన్కు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.