SRCL: ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలంలోని మల్కపేట, మర్తన్నపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.