కృష్ణా: కంకిపాడులో మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ.. మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం కావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేర్సు రాజలక్ష్మి, ఎంపీడీవో పాల్గొన్నారు.