జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన కేడిదొడ్డిలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హన్మంతు ప్రారంభించారు. 2017లో కేటిదొడ్డి మండలానికి పాఠశాల మంజూరు కాగా.. భవనం లేకపోవడంతో ర్యాలంపాడు శివారులోని ప్రభుత్వ సముదాయ భవనంలో కొనసాగిస్తున్నారు.