AP: తిరుపతిలోని దామినేడు వద్ద రూ.140 కోట్లతో, 15 ఎకరాల్లో నిర్మించనున్న నూతన జిల్లా కోర్టు భవనానికి జస్టిస్ సూర్యకాంత్ భూమిపూజ చేశారు. అనంతరం అమరావతిలో పర్యటించనున్న ఆయన.. న్యాయమూర్తుల బంగ్లాలను ప్రారంభించనున్నారు. అలాగే, హైకోర్టు సీజే గెస్ట్ హౌస్తో పాటు పిచ్చుకలపాలెం వద్ద జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.