HNK: తమిళనాడులోని తిరుచిరాపల్లి భారతీదాసన్ యూనివర్సిటీలో మార్చి 2, 3 తేదీల్లో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయం జట్టు పాల్గొననుంది. కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయం నుంచి పి. శ్రీ చైతన్య, ఎస్. సంజయ్ చంద్ర, శివ సాత్విక్, సచిన్, జై శివకుమార్ ఎంపికయ్యారు.