SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి శనివారం ఉ. 7 గంటలకు నరసన్నపేట M కోమర్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీలో పాల్గొంటారు. అనంతరం ఉ. 8 కు నరసన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణ కోసం రిక్షా సైకిళ్లను పంపిణీ చేస్తారు అని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.