AP: కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ‘నిస్సిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయి. బాబు చేసిన పాపాలు పండాయి. దేవుడిని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అంటూ విమర్శించారు.