NLG: ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని నల్లగొండ RM కే. జానీ రెడ్డి తెలిపారు. శుక్రవారం లాజిస్టిక్ రూపొందించిన గోడపత్రికను ఆయన అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 27న భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో, ఏప్రిల్ 3 వరకు రూ. 151 చెల్లించి తలంబ్రాలు ప్యాకెట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.