BDK: మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలో నిర్మించబడిన ఇందిరమ్మ నూతన ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు షేక్ యాకూబీ, ఎస్.కే.బి.బి., మర్రిశెట్టి లక్ష్మీ, తిరుపతమ్మ కుటుంబాల నూతన గృహాల్లో గృహప్రవేశ పూజల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.