కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు బోయ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు గురువారం తెలిపారు. బక్రీద్ ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుని అల్లాహ్ కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తరుపున శుభాకాంక్షలు తెలిపారు.