సత్యసాయి: శాసనమండలిలో శ్రీవారి లడ్డూ అంశంపై చర్చకు కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఉషశ్రీచరణ్ విమర్శించారు. పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇస్తున్నప్పటికీ చర్చకు ముందుకు రావడం లేదన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. చర్చకు ధైర్యంగా రావాలని డిమాండ్ చేశారు.