TPT: నాగలాపురం మండలం సురుటపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరిత రామప్రసాద్ రెడ్డి 11 గ్రాముల బంగారు తాళిబట్టును శ్రీ గౌరీ సమేత దక్షిణామూర్తి స్వామికి సమర్పించారు. ఆలయ ఛైర్మన్ డీ.పద్మనాభ రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అర్చకులు వేదమంత్రాల నడుమ తాళిబొట్టును స్వీకరించారు.