MDK: నార్సింగి మండలం శంకాపూర్ తండాలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను సర్పంచ్ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంతోషమే తన సంతోషమని తండాలో ఉన్న ఆడబిడ్డలు తమ తో బుట్టువులని, వారికి సేవచేయడంలో ఉన్న ఆనందం మరోకటి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు.