AKP: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు నక్కపల్లి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నాకి దిగారు. వేతనాలు రూ.26,000కు పెంచాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింప చేయాలన్నారు. వచ్చేనెల రెండవ తేదీన నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.